పంత్, అక్షర్ కూడా ఔట్.. ఇక అయ్యర్పైనే ఆశలు
- 145 పరుగుల లక్ష్య ఛేదనలో తీవ్ర తడబాటు
- చెలరేగిపోతున్న బంగ్లా స్పిన్నర్లు మెహిదీ, షకీబ్
- శ్రేయస్ అయ్యర్, అశ్విన్ పైనే ఆశలు
ఆ వెంటనే భారీ అంచనాలున్న రిషబ్ పంత్ (9)తో పాటు క్రీజులో కుదురుకున్న అక్షర్ పటేల్ (34)ను మెహిదీ హసన్ పెవిలియన్ చేర్చడంతో భారత్ 74/7తో ఓటమి ముంగిట నిలిచింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అశ్విన్ జట్టును ఆదుకుంటున్నారు. షకీబ్, మెహిదీ హసన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దాంతో, 42 ఓవర్లకు భారత్ 111/7 స్కోరుతో నిలిచింది. అయ్యర్ 26, అశ్విన్ 11 పరుగులతో ఉన్నారు. భారత్ కు ఇంకా 34 పరుగులు కావాలి.