ఫామ్ లోకి వచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్న రిషబ్ పంత్
- కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్న పంత్
- బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న కీపర్
- బుధవారం బంగ్లాతో తొలి టెస్టు ఆడనున్న భారత్
బంగ్లాతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న పంత్ టెస్టుల్లో ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ కూడా నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. రాహుల్ తో పాటు ఓపెనర్ గా రాబోతున్న శుభ్ మన్ గిల్ కూడా నెట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.