రాయలసీమకు ఎవరేం చేశారో ప్రజలే చెబుతారు: సజ్జల
- పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించిన వైసీపీ నేత సజ్జల
- ఇప్పటికీ సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదని విమర్శ
- చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కుప్పం అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని సజ్జల చెప్పారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని జగన్ ను కొనియాడారు. జగన్ చేస్తున్న మంచి పనులపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయమని సజ్జల తేల్చిచెప్పారు. జగన్ పాలనలో మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తాయని సజ్జల చెప్పారు.