మా వాళ్లు రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు: టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ వార్నింగ్
- బీజేపీ నేత అర్వింద్ నివాసంపై దాడులు
- టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఆగ్రహం
- తాము సంయమనం పాటిస్తున్నామని వెల్లడి
- చేతకానితనం అనుకోవద్దని స్పష్టీకరణ
- కవితపై కేసు నమోదు చేయాలన్న డీకే అరుణ
అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పలేని దద్దమ్మలు ఇలాంటి దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, భౌతిక దాడులతో రౌడీయిజం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ గూండాలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజులు సమీపించాయని స్పష్టం చేశారు.
అటు, ఈ అంశంపై బీజేపీ మహిళా నేత డీకే అరుణ కూడా స్పందించారు. ఎంపీ అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరని తెలిసి కూడా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఓ ధర్నా చేస్తేనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.