Mani Ratnam: పొన్నియన్ సెల్వన్ రెండో భాగం విడుదల ఎప్పుడంటే?

  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో పీఎస్2
  • ఏప్రిల్ 28న విడుదలయ్యే అవకాశం
  • రూ. 450 కోట్లు వసూలు చేసిన తొలి భాగం
Mani Ratnam Ponniyin Selvan 2 to release on THIS date

దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ (పీఎస్1) పార్ట్ 1 ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. థియేటర్ రన్ తర్వాత ఓటీటీలోనూ పీఎస్1కు విశేష స్పందన వచ్చింది. పొన్నియన్ సెల్వన్ తొలిభాగం రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. దాంతో, ఇప్పుడు ఈ చిత్రం రెండో పార్టుపై అందరి దృష్టి నెలకొంది. దానికి ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 వచ్చే ఏప్రిల్ 28న  థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 28న విడుదలవుతుందని సమాచారం. 

పీఎస్1 ప్రమోషన్స్ సందర్భంగా, మణి రణం మొదటి భాగం విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత రెండవ భాగాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కన వచ్చే వేసవిలోనే పీఎస్2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పొన్నియన్ సెల్వన్ కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, జయరామ్, శరత్ కుమార్, ప్రభు, ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ, విక్రమ్ ప్రభు సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.

More Telugu News