ధర్నా చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు
- గొర్రెల సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోమటిరెడ్డి ధర్నా
- రెండు గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించిన కోమటిరెడ్డి
- ఉద్రిక్తత మధ్య ఆయనను తరలించిన పోలీసులు
ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తరలించారు.