టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. అసలు సినిమా ముందుందన్న కేటీఆర్

  • ఇప్పటి వరకు వెలుగు చూసింది ట్రైలర్  మాత్రమేనన్న కేటీఆర్
  • ఎమ్మెల్యేలతో గంటలుగంటలుగా మాట్లాడిన ఆడియో క్లిప్‌లు ఉన్నాయన్న మంత్రి
  • జూటా, జుమ్లా బీజేపీని తిరస్కరించాలని మునుగోడు ప్రజలకు అభ్యర్థన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి కేటీఆర్ నిన్న తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఇప్పటి వరకు వెలుగుచూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాల వద్ద చాలా విషయాలు ఉన్నాయన్న కేటీఆర్.. తమ ఎమ్మెల్యేలతో గంటలుగంటలుగా మాట్లాడిన ఆడియో టేపులు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. 

శిశుపాలుడిలా బీజేపీ కూడా చేయాల్సిన తప్పులన్నింటినీ చేసేసిందన్నారు. శిశుపాలుడిని శ్రీకృష్ణుడు శిక్షించినట్టుగానే బీజేపీని కూడా మునుగోడు ప్రజలు శిక్షించాలని కోరారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ డబ్బులతో కొనాలని చూస్తోందన్న మంత్రి.. జూటా, జుమ్లా బీజేపీని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

KTR
TRS
Munugode
Munugode By Poll
BJP

More Telugu News