సోము వీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
- పార్టీని నడపడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న కన్నా
- జనసేనను సమన్వయం చేసుకోవడంలోనూ విఫలమని వ్యాఖ్య
- ఇప్పుడు నిర్ణయాలన్నీ సోము వీర్రాజే తీసుకుంటున్నారని ఆరోపణ
- పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని ఆవేదన
- అధినాయకత్వం జోక్యం చేసుకోవాలన్న మాజీ అధ్యక్షుడు
అసలు పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కూడా కన్నా అన్నారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి రెండు నెలలకు ఓ సారి కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేసుకుని ఆయా సమస్యలు, అంశాలపై చర్చించుకునే వారమని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసలు కోర్ కమిటీ సమావేశాలే జరగడం లేదన్నారు. ఫలితంగా పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో పార్టీ నేతలకే తెలియడం లేదన్నారు. జనసేనతో పార్టీ కీలక నేత మురళీధరన్ సమన్వయం చేస్తారని తెలిసినా.. ఎందుకనో ఆ దిశగానూ అడుగులు పడలేదని కన్నా అన్నారు.