Telangana: ఎన్నికల సభ కోసం వంటమనిషిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం
  • ఎల్లంబావిలో ఎన్నికల సభను నిర్వహించిన టీఆర్ఎస్
  • సభకు వచ్చే వారి కోసం భోజనం తయారీలో మల్కాజిగిరీ ఎమ్మెల్యే
trs mla mynampalli hanmantha rao prepares food for election meeting cadre

మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలు పూర్తి కావడంతో ఇక కీలకమైన పోలింగ్ ఒక్కటే మిగిలింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఈ మూడు ప్రధాన పార్టీలు భారీ సంఖ్యలో నేతలను మునుగోడులో దింపేశాయి. ఎక్కడికక్కడ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి.

ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ కు చెందిన మల్కాజిగిరీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏకంగా వంట మనిషిగా మారిపోయారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో మంగళవారం టీఆర్ఎస్ ఎన్నికల సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే వారి కోసం ఆ పార్టీ భోజన ఏర్పాట్లు కూడా చేసింది. ఈ భోజనం తయారీలో స్వయంగా పాలుపంచుకున్న హన్మంతరావు గరిట పట్టి వంట పనుల్లో నిమగ్నమయ్యారు.

More Telugu News