మెక్సికో బార్లో దుండగుల కాల్పులు.. 12 మంది మృత్యువాత
- అశాంతికి చిరునామాగా మారుతున్న మెక్సికో
- డ్రగ్స్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు
- నిందితుల కోసం గాలిస్తున్న భద్రతా దళాలు
తాజాగా ఓ బార్లోకి చొరబడిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు గల కారణం తెలియరాలేదు. నిందితుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గత నెల మొదటి వారంలో ఇదే రాష్ట్రంలోని టరిమోరోలో జరిగిన కాల్పుల్లో పదిమంది మరణించారు. అలాగే, ఈ నెల 6న గుయెర్రెరో రాష్ట్రంలోని సిటీహాల్లో జరిగిన కాల్పుల ఘటనలో మేయర్ సహా 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.