మ‌రో రూ.500 కోట్ల ఆప్పు చేసిన ఏపీ స‌ర్కారు!

ap taken another 500 crore rupees debt
  • ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ
  • 18 ఏళ్ల కాలానికి 7.85 శాతం వ‌డ్డీకి రుణం సేక‌ర‌ణ‌
  • ఈ ఏడాదిలో ఏపీ అప్పులు రూ.52,108 కోట్లకు చేరిన వైనం
ప్ర‌తి మంగ‌ళ‌వారం రిజ‌ర్వ్ బ్యాంకులో జ‌రిగే సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజ‌రవుతూ రుణాలు సేకరిస్తున్న ఏపీ స‌ర్కారు... ఈ మంగ‌ళ‌వారం కూడా సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజ‌రైంది. ఈ ద‌ఫా రూ.500 కోట్ల రుణాన్ని ఏపీ ప్ర‌భుత్వం సేక‌రించింది. 18 ఏళ్ల కాలానికి 7.85 శాతం వ‌డ్డీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రుణాన్ని సేక‌రించింది. తాజా రుణంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.52,108 కోట్ల రుణం తీసుకున్న‌ట్లైంది. కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధిని ఇప్ప‌టికే దాటేసిన ఏపీ... తాజాగా మ‌రింత రుణం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
RBI
Security Bends
FRBM

More Telugu News