ఈ పట్టుచీర సువాసనలతో గుభాళిస్తుంది!
- 27 సుగంధ ద్రవ్యాలతో రూపొందిన పట్టు చీర
- సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ చేతుల్లో రూపకల్పన
- ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ సరికొత్త ఆలోచన చేశాడు. 27 సుగంధ ద్రవ్యాలతో ఓ పట్టు చీరను నేశాడు. ఇతరత్రా పట్టుచీరల మాదిరే ఈ పట్టుచీరకు వినియోగించిన దారాలను ఆయన సుగంధ ద్రవ్యాలతో కూడిన ద్రావణంలో ముంచి మరీ చీరను నేశాడు. వెరసి ఈ చీరను అలా విప్పగానే... సువానసలు విరజిమ్ముతున్నాయి. ఈ చీరను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు శనివారం ఆవిష్కరించారు. నూతన ఆవిష్కరణలతో సాగుతున్న విజయ్ను మంత్రులు అభినందించారు.