ఏపీ సలహాదారు పదవికి రాజీనామా చేసిన మురళి... కారణాన్ని వివరిస్తూ జగన్కు లేఖ
- మూడేళ్లుగా విద్యాశాఖ సలహదారుగా పనిచేస్తున్న మురళి
- పాఠశాలల మెరుగుదలకు జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారని వెల్లడి
- తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వివరణ
- ఏపీ కంటే తెలంగాణకే తన అవసరం ఉందన్న మురళి
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానన్న విషయాన్ని జగన్కు రాసిన లేఖలో మురళి వివరించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆ పరిస్థితులను మెరుగుపరచేందుకే తాను సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. తన సేవలు ఇప్పుడు ఏపీ కంటే తన సొంత రాష్ట్రానికే అవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విద్యా శాఖకు ప్రత్యేకించి పాఠశాలల మెరుగుదలకు జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ శాఖకు తాను సలహాదారుగా పనిచేయడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని కూడా మురళి పేర్కొన్నారు.