తిరుమలలో అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: టీటీడీ
- ఈ నెల 27 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు
- ఉచితంగా అన్నప్రసాదం అందిస్తామన్న టీటీడీ
- అక్రమంగా విరాళాలు సేకరిస్తే చర్యలుంటాయని హెచ్చరిక
- అనంత గోవిందదాస ట్రస్టుతో తమకు సంబంధం లేదని వెల్లడి
కాగా, తిరుమల కొండ నుంచి ఇతర ప్రాంతాలకు టీటీడీ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతోంది. ఈ బస్సులను సీఎం జగన్ ఈ నెల 27న బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ బస్సులు ఇప్పటికే అలిపిరి డిపోకు చేరుకున్నాయి. తిరుమల-తిరుపతి, తిరుపతి-రేణిగుంట ఎయిర్ పోర్టు మధ్య 64 బస్సులు... కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ విద్యుత్ ఆధారిత బస్సులను నడపనున్నారు.