భారత్ ను అదే పనిగా కీర్తిస్తున్న ట్రంప్.. వచ్చే అధ్యక్ష ఎన్నికలపై గురి
- భారత్-అమెరికా మంచి స్నేహితులంటూ మరోసారి ప్రకటన
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
- భారత సంతతి ప్రజల మనసు చూరగొనే యత్నం
ట్రంప్ తాజాగా ఇండియా టుడేకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఇంకా ప్రసారం కావాల్సి ఉంది. ‘భారత్-అమెరికా మంచి స్నేహితులు’అని ఆయన అందులో పేర్కొన్నారు. భారత్ కు తనకంటే గొప్ప ఫ్రెండ్ మరొకరు లేరని, అమెరికా అధ్యక్షుల్లోనే భారత్ కు మంచి స్నేహితుడిని తానేనంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. మోదీకి తాను మంచి స్నేహితుడినని కూడా చెప్పారు.
నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీతో స్నేహంగా మెలిగారు. భారత్ తో సంబంధాల బలోపేతానికి చర్యలు కూడా తీసుకున్నారు. అమెరికాలోని హూస్టన్ లో 2019లో ట్రంప్ తో పెద్ద బహిరంగ సభలో మోదీ పాలు పంచుకోగా.. అలాగే, ఆ తర్వాత ట్రంప్ సైతం 2020లో అహ్మదాబాద్ లో మోదీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.