అమరావతి రైతుల పాదయాత్రపై మీ స్పందనేంటి?.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రకు సిద్ధమైన రాజధాని రైతులు
- పోలీసుల అనుమతి కోరగా స్పందన రాలేదన్న రైతులు
- హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు
- గురువారం సాయంత్రంలోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు
దీంతో ఇటీవలే తమ పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని, ఈ వ్యవహారంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలంటూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు... అమరావతి రైతులు చేసుకున్న విజ్ఞప్తికి పోలీసుల నుంచి స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రంలోగా రాజధాని రైతుల మహాపాదయాత్రపై ఏదో ఒకటి తేల్చాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో శుక్రవారం తొలి కేసుగా ఈ పిటిషన్పైనే విచారణ చేపడతామంటూ హైకోర్టు చెప్పింది.