భారత్ ఇప్పుడు కెప్టెన్ ను మార్చే తప్పు చేయకూడదు: షోయబ్ అక్తర్
- రోహిత్ శర్మ ఎంతో అసౌకర్యంగా కనిపిస్తున్నాడన్న పాక్ మాజీ క్రికెటర్
- తుది 11 మంది సభ్యుల పరంగా అనిశ్చితి ఉందన్న అభిప్రాయం
- ఆసియాకప్ భారత్ కు మేల్కొలుపుగా పేర్కొన్న అక్తర్
భారత్ విజయం సాధించి, ఫైనల్స్ లో పాక్ తో పోటీపడుతుందని తాను అనుకున్నట్టు అక్తర్ చెప్పాడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టమేనన్నాడు. భారత్ తుది 11 మంది పరంగా ఎంతో అనిశ్చితి నెలకొన్నట్టు చెప్పాడు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోతేనే భారత్ కు అవకాశం ఉంటుంది. ఇది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ, సూపర్ సండే రోజున ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఉంటుందన్న ఆశ అయితే ఉంది’’ అని అక్తర్ పేర్కొన్నాడు.
భారత్ ఇప్పుడు కెప్టెన్ ను మార్చే తప్పు చేయకూడదన్నాడు అక్తర్. ’’రోహిత్ శర్మ చూడ్డానికి చాలా అసౌకర్యంగా ఉన్నాడు. అతడు సహచరులపై అరుస్తున్నాడు. చివరి మూడు మ్యాచుల్లోనూ తుది 11 మంది ఆటగాళ్ల పరంగా ఎన్నో మార్పులు చేశారు. దీంతో ఎంతో అనిశ్చితి ఉన్నట్టు కనిపిస్తోంది’’ పేర్కొన్నాడు.