ఏపీకి ఒకే రాజధాని ఉండాలి... అది అమరావతే కావాలి: పవన్ కల్యాణ్
- మంగళగిరిలో పవన్ను కలిసిన రాజధాని రైతులు
- అమరావతి- అరసవిల్లి పాదయాత్రకు రావాలని కోరిన రైతులు
- యాత్రకు జనసేన మద్దతు ఉంటుందని చెప్పిన పవన్
సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 14 వరకు అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో పాలుపంచుకోవాలని రైతులు పవన్ను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అమరావతి అన్ని కులాల వారిదని పేర్కొన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా 3 రాజధానుల పేరిట కొత్త సమస్యను సృష్టించారన్నారు. రాజధాని రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్న పవన్.. రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని కూడా పవన్ చెప్పారు.