రేపే మునుగోడులో కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌... పోస్ట‌ర్ ఇదిగో

trs releases its munugodu public meeting poster
  • రేపు మునుగోడు మండల కేంద్రంలో స‌భ‌
  • మ‌ధ్యాహ్నం 2 గంల‌కు సభ మొద‌లు ‌
  • అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నున్న కేసీఆర్‌
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేప‌థ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా రాష్ట్రంలోని 3 ప్ర‌ధాన పార్టీలు ఈ ఎన్నిక‌కు సంబంధించిన త‌మ అభ్య‌ర్థి పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే రేపు (శ‌నివారం) మునుగోడులో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నుంది.

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఇప్ప‌టికే సూత్ర‌ప్రాయంగా ఖ‌రారు చేసింది. ఈ విష‌యాన్ని రేప‌టి మునుగోడు స‌భ‌లో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు. ఈ క్ర‌మంలో రేపు మునుగోడు మండ‌ల కేంద్రంలో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను టీఆర్ఎస్ శుక్ర‌వారం ఆవిష్క‌రించింది. ఈ స‌భ‌కు ప్ర‌జా దీవెన స‌భ అనే పేరు పెట్టింది. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఈ స‌భ‌లో మునుగోడు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచే అభ్యర్థి పేరును కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు.
Go Back to Shorts
Nalgonda District
Telangana
TRS
KCR
Munugodu Bypoll
Prabhakar Reddy Koosukuntla

More Telugu News