Team India: కామన్వెల్త్ క్రీడల క్రికెట్ ఫైనల్: టాస్ ఓడిన టీమిండియా మహిళలు

  • టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • ఎడ్జ్ బాస్టన్ మైదానంలో మ్యాచ్
  • బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా
Team India lost toss against Australia in Commonwealth cricket final

కామన్వెల్త్ క్రీడల క్రికెట్ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం ఈ అంతిమ సమరానికి వేదిక. ఈ పోటీలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మహిళలు 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేశారు. రేణుక బౌలింగ్ లో అలీసా హీలీ వికెట్ల ముందు దొరికిపోయింది. 

ప్రస్తుతం బెత్ మూనీ, కెప్టెన్లో మెగ్ ల్యానింగ్ ఉన్నారు. కాగా, లీగ్ దశలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఆసీస్ ను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసే అవకాశాన్ని భారత్ జారవిడుచుకుంది.

More Telugu News