Vice President: ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వేళ‌ గుజ‌రాత్ ఆల‌యాల సంద‌ర్శ‌న‌లో వెంక‌య్య‌... ఫొటోలు ఇవిగో

  • స‌తీస‌మేతంగా గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న వెంక‌య్య‌
  • గుజ‌రాత్‌లోని ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్న ఉప‌రాష్ట్రప‌తి
  • రాత్రికి తిరిగి ఢిల్లీ చేర‌నున్న వెంకయ్య దంప‌తులు
venkaiah naidu tours gujarat with his wife

ఓ వైపు ఢిల్లీలో త‌దుప‌రి ఉప‌రాష్ట్రప‌తిని ఎన్నుకునేందుకు పోలింగ్ జ‌రుగుతుండ‌గా... ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్రప‌తిగా కొన‌సాగుతున్న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు స‌తీస‌మేతంగా గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. తన భార్య ఉషతో కలిసి శనివారం గుజరాత్‌లోని జామ్ న‌గ‌ర్ చేరిన వెంక‌య్య‌నాయుడు.. రాష్ట్రంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తున్నారు. 

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వెంక‌య్య దంప‌తులు ఇప్ప‌టికే ద్వార‌కాలోని నాగేశ్వ‌ర్ జ్యోతిర్లింగ ఆల‌యం, ద్వార‌కాదీశ ఆల‌యం, పోర్ బంద‌ర్‌లోని కృతి ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. ఈ రోజు గుజరాత్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకోనున్న వెంక‌య్య రాత్రికి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఈ నెల 10న ఉపరాష్ట్రప‌తిగా వెంక‌య్య ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. శ‌నివారం కొత్త‌గా ఎన్నిక కానున్న ఉప‌రాష్ట్రప‌తి ఈ నెల 11న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

More Telugu News