రాజ‌గోపాల్ రెడ్డి వెంట వెళుతున్నార‌ని... మునుగోడులో నాలుగు మండ‌లాల అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ వేటు

congress suspends 4 mandal presidents in munugodu assembly
  • ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి
  • పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌క‌ముందు జాగ్ర‌త్త ప‌డ్డ ఎమ్మెల్యే
  • మునుగోడు, నాంప‌ల్లి, మ‌ర్రిగూడ‌, చండూరు మండ‌లాల అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ వేటు
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు కాంగ్రెస్ పార్టీకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంగ‌ళ‌వారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌క‌ముందే కోమ‌టిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో మునుగోడుపై మంచి ప‌ట్టున్న కోమ‌టిరెడ్డి వెంట ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నార‌న్న వార్త‌ల‌పై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. 

దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా రాజ‌గోపాల్ రెడ్డి వెంట వెళుతున్నార‌ని భావిస్తున్న 4 మండ‌లాల పార్టీ అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వారిలో మునుగోడు, మ‌ర్రిగూడ‌, నాంప‌ల్లి, చండూరు మండ‌లాల అధ్య‌క్షులు ఉన్నారు.
Go Back to Shorts
Congress
Telangana
Komatireddy Raj Gopal Reddy
Munugodu

More Telugu News