హత్రాస్‌లో కన్వర్ యాత్రికులపై నుంచి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి దుర్మరణం

6 dead after truck mows down Kanwar devotees in Hathras
  • తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఘటన
  • హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వెళ్తున్న యాత్రికులు
  • మరొకరి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. 

మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్చారు. కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hathras
Uttar Pradesh
Kanwar Yatra

More Telugu News