వరద ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించిన బస్సు ఇదే
- వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గం మీదుగా కేసీఆర్ ప్రయాణం
- అందుకోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సును వినియోగించిన అధికారులు
- బస్సుపై నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు
సాధారణంగా సీఎంల పర్యటన కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బుల్లెట్ ప్రూఫ్తో కూడిన బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. అందులో భాగంగా సీఎం కేసీఆర్ టూర్ కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసింది. ఈ బస్సులోనే కేసీఆర్ వరంగల్ నుంచి భద్రాచలం వెళ్లారు. రోడ్లపై వర్షపు నీటిలోనే ఈ బస్సు వెళుతుండగా... ఆ బస్సును సీఎం కాన్వాయ్లోని కార్లు అనుసరించాయి. ఈ ఫొటోలు నేషనల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.