అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే!... యూపీలో ప్రారంభించిన మోదీ!

pm narendra modi inaugurated Bundelkhand Expressway
దేశంలో ర‌హ‌దారుల ప్ర‌మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతం పురోభివృద్ధి ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 7 జిల్లాల‌ను క‌లుపుతూ 296 కిలో మీటర్ల మేర ఈ ర‌హ‌దారిని నిర్మించారు. 6 లేన్ల‌తో ఏర్పాటైన ఈ ర‌హ‌దారికి కేంద్రం ఏకంగా రూ.14,850 కోట్ల‌ను వెచ్చించింది. ఈ ర‌హ‌దారిని శ‌నివారం యూపీలోని జ‌లాన్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాంఛ‌నంగా ప్రారంభించారు. 

ఈ కొత్త ర‌హ‌దారికి చెందిన ఫొటోలు, వీడియోలు గ‌డ‌చిన రెండు, మూడు రోజులుగా చక్క‌ర్లు కొడుతున్నాయి. అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మిత‌మైన ఈ ర‌హ‌దారితో బుందేల్‌ఖండ్ రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని మోదీ స‌ర్కారు చెబుతోంది. ఈ ర‌హ‌దారితో బుందేల్‌ఖండ్ పారిశ్రామికంగానే కాకుండా ఆయా ప్రాంతాల‌తో మ‌రింత మెరుగైన వ్యాపార బంధాలు నెల‌కొనే అవ‌కాశాలున్నాయ‌ని కేంద్రం చెబుతోంది. ఈ ర‌హదారిని మోదీ ప్రారంభించిన వీడియోను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Prime Minister
Narendra Modi
BJP
G. Kishan Reddy
Uttar Pradesh
Bundelkhand Expressway

More Telugu News