తెలంగాణలో రెడ్ అలెర్ట్ జారీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- ప్రాజెక్టులకు భారీగా వరద
ఆల్మట్టి జలాశయంలో శుక్ర-శనివారాల మధ్య 24 గంటల్లో 6 టీఎంసీల మేర నిల్వ పెరిగింది. అలాగే, తుంగభద్ర డ్యాంలో 8 టీఎంసీ నిల్వ పెరిగింది. శ్రీరామసాగర్లోకి శుక్రవారం 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా శనివారానికి అది 1.25 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 39.20 టీఎంసీల నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 70 వేల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.