Team India: రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు మొదట బ్యాటింగ్

Team India put into bat after England won the toss in 2nd T20
  • తొలి టీ20లో టీమిండియా విజయం
  • నేడు బర్మింగ్ హామ్ లో రెండో మ్యాచ్
  • టీమిండియా గెలిస్తే సిరీస్ వశం
  • జట్టులోకి వచ్చిన కోహ్లీ, బుమ్రా, జడేజా
ఇంగ్లండ్ పై తొలి టీ20 గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా నేడు రెండో టీ20కి సిద్ధమైంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. కాగా, ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఎగరేసుకెళ్లాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. అందుకే ఈ మ్యాచ్ కోసం రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాకు చోటు కల్పించారు. 

మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. తొలి టీ20లో తన బౌలింగ్ తో ఆకట్టుకున్న యువ పేసర్ అర్షదీప్ సింగ్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు. 

ఇక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. రీస్ టాప్లే, టైమల్ మిల్స్ స్థానంలో డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లీసన్ జట్టులోకి వచ్చారని వివరించాడు.
Team India
England
Toss
2nd T20
Birmimgham

More Telugu News