హైటెన్షన్ వైర్లపై ఉడుత పడింది... అందుకే తీగలు తెగి ఆటోపై పడ్డాయి: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు వివరణ

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం
  • హైటెన్షన్ వైర్లు తెగి పడి ఆటో దగ్ధం
  • ఐదుగురు మహిళలు సజీవదహనం
  • ఉడుత కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్టు గుర్తింపు
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుండంపల్లి వద్ద ఓ ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడగా, ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనమయ్యారు. కాగా, ఆ హైటెన్షన్ వైర్లు తెగిపోవడానికి కారణం ఓ ఉడుత అని తేలింది. హైటెన్షన్ వైర్లపైకి ఉడుత ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ జరగడంతో తీగలు తెగిపోయాయని, ఆ సమయంలో అటుగా ఆటో రావడంతో దానిపై పడ్డాయని వివరించారు. 

ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటిండెంట్ ఇంజినీర్ కు ఆదేశాలు జారీ చేసినట్టు హరినాథరావు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు విద్యుత్ శాఖ తరఫున రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున తక్షణ ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించినట్టు వివరించారు.

Harinatha Rao
APSPDCL CMD
Squirrel
High Tension Cables
Auto
Sri Sathyasai District

More Telugu News