TRS: సిద్ధిపేట స‌ర్కారీ బ‌డిలో అడ్మిష‌న్ల కోసం పోటెత్తిన జ‌నం!

  • విద్యా బోధ‌న‌లో స‌త్తా చాటుతున్న స‌ర్కారీ బ‌డులు
  • సర్కారీ బ‌డుల బాగు కోసం ప్ర‌భుత్వాల క‌స‌రత్తు
  • సిద్ధిపేట‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో అడ్మిష‌న్ల‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం
  • ఫొటోను పోస్ట్ చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు శ్రీనివాస‌రెడ్డి
This is the rush to get an admission into a government school in Siddipet town

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు విద్యా బోధ‌న‌లో స‌త్తా చాటుతున్నాయి. ఫ‌లితంగా ఏటికేడు స‌ర్కారీ బ‌డుల్లో అడ్మిష‌న్ల కోసం పిల్ల‌ల త‌ల్లిదండ్రులు క్యూ క‌డుతున్నారు. ఏపీలో నాడు-నేడు, తెలంగాణ‌లో మ‌న ఊరు- మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మాల‌తో స‌ర్కారీ బ‌డుల‌ను బాగు చేసే కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వెర‌సి స‌ర్కారీ బ‌డుల్లో ప్ర‌వేశాలు ఏమాత్రం ఆల‌స్యం చేసినా దొర‌క‌డం లేదు. ఈ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కె.శ్రీనివాస‌రెడ్డి మంగ‌ళ‌వారం ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్ధిపేట‌కు చెందిన ఓ స‌ర్కారీ బ‌డిలో ప్ర‌వేశాల కోసం పోటెత్తిన ఫొటోను శ్రీనివాస‌రెడ్డి పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూస్తుంటే... ఏ ప్రైవేట్ పాఠ‌శాల‌లో కూడా ప్ర‌వేశాల కోసం ఈ త‌ర‌హా ర‌ద్దీ క‌నిపించ‌దేమో అన్న భావ‌న క‌లుగుతోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌న‌మంటూ శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.

More Telugu News