Microsoft: విండోస్ 7, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్

Microsoft warns users about security threat
షార్ట్స్‌లో చూడండి
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది. 

విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ తెలిపింది. ఈ లోపాన్ని 'ఫోలినా' అని పేర్కొంది. 

మైక్రోసాఫ్ట్ వర్డ్ వంటి అప్లికేషన్ల సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడేందుకు ఫోలినా అనే ఈ లోపం సాయపడుతుందని వివరించింది. తద్వారా హ్యాకర్లు తాము ప్రవేశించిన కంప్యూటర్లలో ఎలాంటి కోడ్ నైనా రన్ చేయగలరని, డేటాను మార్చడం, ప్రోగ్రామ్స్ ఇన్ స్టాల్ చేయడం, డేటాను డిలీట్ చేయడం, కొత్త విండోస్ అకౌంట్లు సృష్టించగలరని పేర్కొంది.
Go Back to Shorts
Microsoft
Bug
Follina
Windows 7
Update

More Telugu News