ఏపీ సర్కారీ సర్వే పత్రాన్ని కాల్చేసి, అధికారుల గ్రూప్లో వీడియోను పోస్ట్ చేసిన వలంటీర్
- ఏపీలో ఇటీవలే ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వం
- సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల సేకరణ బాధ్యతలు వలంటీర్లకు
- ఇందుకోసం సర్వే పత్రాలను వలంటీర్లకు పంపిన ప్రభుత్వం
- గొడ్డు చాకిరీతో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్న వలంటీర్ బాషా
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... వైసీపీ సర్కారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఓ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలంటూ వలంటీర్లను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ సర్వే పత్రాన్ని వలంటీర్లకు పంపింది. ఈ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాషా... ఆ సర్వే పత్రాన్ని కాల్చేశారు. కాలుతున్న సర్వే పత్రాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సహచర వలంటీర్లతో పాటు అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.