Narendra Modi: పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల చేసిన కేంద్రం

  • 10 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ది
  • రూ.21 వేల కోట్ల విడుదల
  • సిమ్లాలో ఓ కార్యక్రమంలో నిధులు విడుదల చేసిన మోదీ
  • ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ
Modi releases PM Kisan funds

రైతులకు లబ్ది చేకూర్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా నేడు 11వ విడత నిధులను విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులను జమ చేశారు. 10 కోట్లకు పైగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.21 వేల కోట్లను విడుదల చేశారు. కేంద్రం ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6 వేలు అందిస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున విడుదల చేస్తోంది. 


  • Loading...

More Telugu News