ఆరున్నరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జియా
- షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి
- ఆరున్నరేళ్లుగా ముంబై బైకుల్లా జైలులో ఉంటున్న ముఖర్జియా
- గురువారం బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
తాజాగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాగా...ఇంద్రాణి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను నొప్పించిన వారందరినీ క్షమించేశానని, ఇన్నేళ్ల జైలు జీవితంలో చాలా నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు.