సీఎం జగన్తో బీద మస్తాన్ రావు భేటీ... రాజ్యసభ సీటిచ్చినందుకు కృతజ్ఞతలు
- తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్కు వచ్చిన బీద మస్తాన్ రావు
- వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు
- 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలోనే తనను రాజ్యసభకు పంపేందుకు నిర్ణయం తీసుకున్న జగన్కు కృతజ్ఞతలు తెలిపేందుకే మస్తాన్ రావు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మస్తాన్ రావు... 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆయన ఏకంగా రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకోవడం గమనార్హం.