శ్రీలంక పరిస్థితి పట్ల చలించిపోయిన తమిళనాడు సర్కారు... భారీగా నిత్యావసర వస్తువుల తరలింపు
- శ్రీలంకతో దుర్భరంగా మారిన ప్రజాజీవనం
- ప్రజలకు అందుబాటులో లేని నిత్యావసరాలు
- ఆకాశాన్నంటుతున్న ధరలు
- తమిళనాడు ఆపన్నహస్తం
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే శ్రీలంకకు 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, పెద్దసంఖ్యలో ప్రాణాధార ఔషధాలు పంపిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తొలి విడత నిత్యావసరాలతో కూడిన నౌకకు నిన్న స్టాలిన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శ్రీలంక దయనీయ పరిస్థితి పట్ల ప్రజలు కూడా మానవతా దృక్పథంతో స్పందించి విరాళాలు అందజేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
.