శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట

Relief to Sri Lanka president Gotabaya Rajapaksa
  • ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
  • గొటబాయ రాజపక్సపై విపక్షాల అవిశ్వాస తీర్మానం 
  • గొటబాయపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
శ్రీలంక ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రి మహింద రాజపక్స ప్రజాగ్రహం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పగ్గాలను చేపట్టారు. రణిల్ ప్రధాని అయిన తర్వాత శ్రీలంక పార్లమెంటు తొలిసారి సమావేశమయంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 

ఈ అవిశ్వాస తీర్మానాన్ని తమిళ్ నేషనల్ అలయన్స్ ఎంపీ సుమంథిరన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం ఎస్ జేబీ ఎంపీ లక్ష్మణ్ కిరియెల్లా కూడా మద్దతు పలికారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని 119 మంది ఎంపీలు వ్యతిరేకించగా... 68 మంది ఎంపీలు మద్దతు పలికారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మరో వైపు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడమే తన ప్రధాన లక్ష్యమని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
Go Back to Shorts
Gotabaya Rajapaksa
Sri Lanka
No confidence Motion

More Telugu News