కాకాణి మీడియా సమావేశంలో నిలిచిన విద్యుత్ సరఫరా
- విద్యుత్ కోతలపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం
- సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాకాణి
- కాకాణి మాట్లాడుతుండగానే నిలిచిన విద్యుత్ సరఫరా
ఈ నేపథ్యంలో బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయిన విషయాన్ని వెల్లడించేందుకు బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత కాసేపటికే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో కాకాణి తన సమావేశాన్ని కొనసాగించారు.