Telangana: తెలంగాణలో తాజాగా 28 మందికి కరోనా పాజిటివ్

Telangana corona pandemic updates

  • గత 24 గంటల్లో 14,597 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 20 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 32 మంది
  • ఇంకా 331 మందికి చికిత్స 

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,597 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,072 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,630 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 331 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana
Corona Pandemic
New Cases
Today Cases
  • Loading...

More Telugu News