హైదరాబాదులో రూ.246 కోట్లతో ఫెర్రింగ్ ల్యాబరేటరీస్... ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- హైదరాబాదుకు భారీ పెట్టుబడులు
- ముందుకొచ్చిన స్విట్జర్లాండ్ సంస్థ
- జీనోమ్ వ్యాలీలో ల్యాబ్ ఏర్పాటు
పునరుత్పాదక ఔషధాల రంగంలోనూ, ప్రసూతి సంబంధిత ఆరోగ్య రంగంలోనూ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ హైదరాబాదులో భారీ పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.