యాదాద్రిలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
- పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం
- మహాక్రతువు ఉత్సవంలో పాల్గొనేందుకు యాదాద్రికి కేసీఆర్
- కాసేపట్లో మహా కుంభాభిషేకం
ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయమే శివాలయ యాగ శాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం నిర్వహిస్తారు. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతోంది.