Andhra Pradesh: ఏపీలో తాజాగా 4 కరోనా కేసులు... వివరాలు ఇవిగో!

AP Corona updates
  • గత 24 గంటల్లో 2,183 కరోనా పరీక్షలు
  • ఏలూరు జిల్లాలో 3 కేసుల నమోదు
  • తిరుపతి జిల్లాలో ఒక కేసు
  • కరోనా నుంచి కోలుకున్న ఏడుగురు
ఏపీలో గడచిన 24 గంటల్లో 2,183 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఏలూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇటీవల కొన్నిరోజులుగా ఏపీలో సింగిల్ డిజిట్ లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనేక జిల్లాలలో కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కావడంలేదు.
Andhra Pradesh
Corona Virus
Updates
Daily Bulletin

More Telugu News