ఢిల్లీలోనే అమరావతి రైతులు... కేంద్ర మంత్రులు గడ్కరీ, ఠాకూర్లతో భేటీ
- అమరావతి పరిస్థితిని మంత్రులకు వివరించిన రైతులు
- రైతుల వెంట వెళ్లిన రేణుకా చౌదరి, సుంకర పద్మశ్రీ
- గడ్కరీతో భేటీ సమయంలోనే వచ్చిన కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీకి అమరావతి రైతులకు తోడుగా కాంగ్రెస్ పార్టీ నేతలు రేణుకా చౌదరి, సుంకర పద్మశ్రీలు కూడా మంత్రి నివాసానికి వెళ్లారు. కేంద్ర మంత్రితో అమరావతి రైతులు చర్చిస్తుండగానే.. అక్కడికి తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. కిషన్ రెడ్డి సమక్షంలోనే అమరావతి రైతులు తమ సమస్యలను నితిన్ గడ్కరీకి విన్నవించారు.