భద్రాచలం ఆలయంలో ప్రసాదం, ఇతర టికెట్ ధరల పెంపు
- నిత్యకల్యాణం, అభిషేకం టికెట్ ధరలు రూ. 1,500కు పెంపు
- 500 గ్రాముల నుంచి 400 గ్రాములకు తగ్గిన మహాలడ్డు బరువు
- కేశఖండన టికెట్ రూ.20కి పెంపు
100 గ్రాముల చిన్న లడ్డు ధరను రూ.20 నుంచి రూ.25కు, పులిహోర ధరను రూ. 10 నుంచి రూ.15కు, చక్కెరపొంగలి ధరను రూ. 10 నుంచి రూ.15కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 100 రూపాయల మహాలడ్డు బరువును అరకేజీ నుంచి 400 గ్రాములకు తగ్గిస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.