టాటాకు భారత రత్నఇవ్వాలని పిటిషన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు
- పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త రాకేశ్
- కీలక ప్రశ్నలను సంధించిన ఢిల్లీ హైకోర్టు
- పిటిషన్ను ఉపసంహరించుకున్న పిటిషనర్
ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేయగా.. ఓ వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తుందా? అంటూ పిటిషనర్ను నిలదీసింది. అయితే కనీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయినా చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి కోర్టు ఎక్కడ జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆగ్రహాన్ని గ్రహించిన పిటిషనర్ చివరకు తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.