నన్ను పిలవలేదు.. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- యాదాద్రి పునఃప్రారంభం విషయంలో సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు
- కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది
- ఇలాంటి రాజకీయాలు చేయడం బాధాకరమన్న వెంకట్ రెడ్డి
'యాదాద్రి పునఃప్రారంభం విషయంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా వున్న నన్ను పునఃప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించింది. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం' అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్వీట్ చేశారు.