ఏపీలో బాగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 10,502 కరోనా పరీక్షలు
  • 41 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 75 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 395
ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 395కి పడిపోయింది. 

కొత్త కేసుల విషయానికొస్తే... తాజాగా 10,502 కరోనా పరీక్షలు చేపట్టగా, 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,323 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మరణించారు.
.


More Telugu News

Andhra Pradesh Active Cases Corona Virus Today Cases