Andhra Pradesh: రేపు, ఎల్లుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు!

  • జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా కారణంగా మరణాలు
  • ప్రభుత్వంపై మండిపడుతున్న విపక్షాలు
  • మార్చి 19, 20 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చిన టీడీపీ
TDP to take up protests for two days

పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతోందని... కల్తీ మందు తాగి జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. 

ఈ మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత నాలుగైదు రోజులుగా పట్టుబడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. 

జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జే-బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News