పాతబస్తీ వాసులకు శుభవార్త.. ఫలక్నూమా దాకా మెట్రో!
- ఎంజీబీఎస్ వరకే మెట్రో సదుపాయం
- పాతబస్తీకి విస్తరించని మెట్రో
- ఎంజీబీఎస్ నుంచి ఫలక్నూమా దాకా మెట్రో
- 5.5 కిలోమీటర్ల రూటుకు రూ.500 కోట్ల కేటాయింపు
హైదరాబాద్ మెట్రో వచ్చాక నగరంలో ప్రయాణం రూపులేఖలే మారిపోయాయని చెప్పాలి. నగరమంతా విస్తరించకున్నా.. మెట్రో నడిచే రూట్లలో ప్రయాణం బాగానే మారిపోయింది. అయితే పాతబస్తీలోకి ఈ మెట్రో ఇప్పటిదాకా అడుగు పెట్టనే లేదనే చెప్పాలి. అయితే పాతబస్తీకి కూడా మెట్రో సదుపాయాన్ని విస్తరించేలా హరీశ్ రావు తన బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నూమా దాకా 5.5 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది.