ఓటీఎస్ లబ్ధిదారులకు రూ.3 లక్షల రుణం: ఏపీ సీఎం జగన్
- ఓటీఎస్తో లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్
- దానిని బ్యాంకులో పెడితే రూ.3 లక్షల రుణం
- ఓటీఎస్ సమీక్షలో జగన్ వెల్లడి
సోమవారం నాడు ఓటీఎస్ పథకంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు వై శ్రీలక్ష్మి, అజయ్ జైన్, రజత్ భార్గవ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.20వేలు కట్టి ఓటీఎస్ తీసుకోవటం ద్వారా ఎటువంటి లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ లబ్దిదారులకు వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆ కాగితాలను బ్యాంకులో పెట్టి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీని వల్ల లబ్దిదారులు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.