ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. చలి నుంచి విముక్తి
- ఒకటి నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- అనంతపురంలో గరిష్ఠంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఏజెన్సీ, రాయలసీమ శివారు ప్రాంతాల్లో మాత్రం చలి వాతావరణం
అనంతపురంలో అత్యధికంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లోనూ పొడి వాతావరణం ఉందని, వచ్చే రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. కాగా, వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తుండడంతో విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ శివారు ప్రాంతాల్లో మాత్రం చలి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.